అమరావతి 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక

– ప్రజలు అమరావతిని కాపాడుకోకపోతే రాష్ట్ర భవిష్యత్ అంధకారమే
– రాష్ట్ర అభివృద్దిని కాంక్షించే ప్రతి ఒక్కరూ రైతుల పాదయాత్రకు మద్దతు తెలపాలి
– నారా చంద్రబాబు నాయుడు
ప్రజా రాజధాని అమరావతి 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నా. ఇది పాదయాత్ర కాదు, రాష్ట్ర పరిరక్షణ కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమితల్లి వారసులు చేస్తున్న ఉద్యమం.
1999లో విజన్ 2020తో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసుకున్నాం. విభజన అనంతరం విజన్ 2029 లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అమరావతితో పాటు నవ్యాంధ్ర సమగ్రాభివృద్దికి నాంది పలికాం.
ఓ వైపు ‎ విజన్ 2020 ఫలితాలు చూసి సంతోషం కలుగుతున్నా…మరో వైపు విజన్ 2029 ప్రణాళికల అమలుపై గొడ్డలి వేటుతో బాధగలుగుతోంది. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేం. అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అంధకారమవుతుంది.
ఈ మహా పాదయాత్రకు తెలుగుదేశం శ్రేణులు, ప్రజలు, ప్రజాసంఘాలు, రాష్ట్ర అభివృద్దిని కాంక్షించే ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలి. 5 కోట్ల ప్రజల గుండె చప్పుడు… తెలుగుజాతి అఖండజ్యోతి అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

Leave a Reply