Suryaa.co.in

Andhra Pradesh

రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం

అరక దున్ని అన్నదాత కష్టాలు తెలుసుకున్న యువనేత నారా లోకేష్

ఆలూరు నియోజకవర్గం కారుమంచి శివార్లలో యువనేత పాదయాత్ర చేస్తున్న సమయంలో పొలం పనులు చేసుకుంటున్న ఓ రైతువద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అరకదున్నుతూ రైతన్న కష్టాలు తెలుసుకున్నారు.
• మేం ముగ్గురు అన్నదమ్ములం కలిసే ఉంటున్నాం, మా ఉమ్మడి కుటుంబానికి 11 ఎకరాల భూమి ఉంది.
• గత ఏడాని మూడు ఎకరాల్లో ఉల్లిసాగు చేయగా, వరదవచ్చి పంట మొత్తం కొట్టుకుపోవడంతో రూ.3లక్షల నష్టం వచ్చింది.
• 4 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే నాసిరకం విత్తనాలు కావడంతో 2 క్వింటాళ్లే దిగుబడి వచ్చింది.
• మరో నాలుగు ఎకరాల్లో వేరుశనగ నాటితే 14.35 క్వింటాళ్ల దిగుబడి రాగా, పెట్టుబడి, కూలీలు పోనూ రూ.2.40 లక్షల నష్టం వచ్చింది.
• మేం వ్యవసాయం చేయబడ్డాక ఇంత భారీనష్టాలు జీవితంలో చూడలేదు.
• ట్రాన్స్ ఫార్మర్ ఫీజు వేయాలంటే హెల్పర్లు రూ.5 వందలు అడుగుతున్నారు.
• ఏటికేడు నష్టాలు చవిచూస్తున్నా మరో పని తెలియకపోవడంతో వ్యవసాయం చేయాల్సి వస్తోంది.
• ప్రభుత్వాలు ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని చాలించడం తప్ప మరో మార్గంలేదు.
యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానాల కారణంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
• టిడిపి హయాంలో ఎపిలో రైతుల సగటు అప్పు రూ.70వేలు ఉంటే, ఇప్పుడూ దేశంలోనే అత్యధికంగా రూ.2.5లక్షలకు చేరింది.
• రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది.
• గత ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాలు అందజేశాం.
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన సబ్సిడీలన్నీ ఎత్తేశాడు.
• దీనికితోడు కొత్తగా మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నాడు.
• ధైర్యంగా ఉండండి…రాబోయే చంద్రన్న ప్రభుత్వం అన్నదాతలకు అన్నివిధాలా అండగా నిలుస్తుంది.

LEAVE A RESPONSE