తప్పు చేసిన పోలీసుల తాటతీయక తప్పదు

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ పాలనలో కొందరు పోలీసుల అరాచకాలకు రోజు రోజుకీ హద్దు లేకుండా పోతోంది, పోలీసులు తమ పరిది దాటి చట్టాలను ఉల్లఘింస్తూ రాజ్యాంగాన్ని దిక్కరిస్తూ వైసీపీ నేతలు చెప్పినట్టు చేస్తున్నారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేశారన్న కారణంతో టీడీపీ కార్యకర్త అంజిపై కడప జిల్లా చిన్నమండెం పోలీసులు అక్రమ కేసులు పెట్టి స్టేషన్కిర తీసుకొచ్చి కొట్టి హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తే పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటి? ఎవరి ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్త అంజిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారో పోలీసులు చెప్పాలి. కండ్రికలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడితే వైసీపీ కార్యకర్తలను వదిలేసి టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్ధ పనితీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీసులకు ప్రభుత్వం జీతాలు ఇచ్చేది ఎందుకు? రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికా ? లేక టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేయడానికా? కొందరు పోలీసుల వ్యవహరిస్తున్న తీరుతో మొత్తం పోలీసు వ్యవస్ధకు చెడ్డపేరు తెస్తోంది. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై నమెదు చేసిన తప్పుడు కేసులతో పోలీసు స్టేసన్లలో ఎఫ్ఐర్ పుస్తకాలన్నీ నిండిపోయాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన ప్రతి తప్పుడు కేసును, ఆ కేసు పెట్టిన పోలీసు అధికారి పేర్లను రాసుకుంటున్నాం. ఇప్పుడు పెట్టిన ప్రతి తప్పుడు కేసుకు భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులని, కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టిన ఏ ఒక్కరిని వదలం. పోలీసులు ఇకనైనా తమ పద్దతి మార్చుకుని చట్టం ప్రకారం నడుచుకోవాలి.

Leave a Reply