Suryaa.co.in

Andhra Pradesh

పోలీసులపై దాడులా?.. హవ్వ.. సిగ్గుచేటు!

రాష్ట్రంలో వైసీపీ నాయకులు పోలీసులపై దాడికి పాల్పడుతున్నారంటూ డీజీపీకి లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

• రాష్ట్రంలో అధికారపార్టీ నేతలు పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారనే వార్త ఒక మాజీ పోలీసు అధికారిగా నాకు బాధ కలుగుతోంది.
• పోలీసులపై దాడులు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయనడానికి నిదర్శనం.
• కడపలో అనిల్ కుమార్ అనే పోలీసు అధికారిపై స్థానిక వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం దుర్మార్గం.
• అనిల్ కుమార్ భార్య న్యాయం చేయాలంటూ పబ్లిక్‌గా రోధిస్తూ 100కు డెయిల్ చేయడం హృదయవిదారకం
• వైసీపీ పాలనలో జరుగుతున్న ఇటువంటి ఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదు.
• గతంలో ఇదే కడపలో హైమావతి అనే సర్కిల్ ఇన్ప్సెక్టర్ ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే ఆమెపై దాడికి పాల్పడ్డారు. బలవంతంగా ఆమె పిర్యాదును వెనక్కు తీసుకునేలా చేశారు.
• విశాఖపట్నం జిల్లా మూకవరపాడులో వైసీపీ ఎంపీ బంధువులు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లపై దాడికి పాల్పడ్డారు.
• సత్యసాయి జిల్లా, మోటుకుపల్లిలో వైసీపీ ఎంపీపీ భర్త వేణుగోపాల్ రెడ్డి అనే కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు.
• ధర్మవరం వైసీపీ నాయకులు హిందూపురం పోలీస్ స్టేషన్ లో ఒక మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశారు.
• ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో పోలీసులపై అధికారపార్టీ నాయకులు అనేక దాడులకు పాల్పడ్డారు.
• అధికారపార్టీకి కొమ్ముకాస్తూ వైసీపీ నాయకులను వెనకేసుకొచ్చే పోలీసు సంఘాలు పోలీసులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం మాట్లాడటం లేదు.
• రాష్ట్రంలో పోలీసులకు ఇటువంటి పరిస్థితి దాపురించడానికి కారణం అధికార పార్టీ నాయకులను వెనకేసుకొస్తూ ప్రతిపక్షాలపై తప్పడు కేసులు నమోదు చేస్తున్న కొంతమంది పోలీసు అధికారులే.
• ఇప్పటికైనా పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు వీటిపై స్పందించి ఇటువంటి దుర్మార్గాలను అరికట్టకపోతే రాష్ట్రంలో శాంతిభద్రతలకు పూర్తి విఘాతం కలుగుతుంది.
• పోలీసు అధికారులపై దాడులకు పాల్పడిన అధికారపార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోండి.
• పోలీస్ బాస్ గా పోలీసు శాఖ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన భాధ్యత మీపై ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ అధికారపార్టీకి కొమ్ముకాస్తున్న నేరస్తులపై కఠిక చర్యలు తీసుకోండి.

LEAVE A RESPONSE