హిందువుల సహనాన్ని పిరికితనంగా భావిస్తారా?

-హిందూ పండుగలంటే అంత చులకనా?
-తక్షణమే వినాయక్ సాగర్ నిమజ్జన ఏర్పాట్లు చేయండి
-లేనిపక్షంలో ఏం చేయాలో మాకు తెలుసు
-సర్కార్ తీరుకు నిరనసగా రేపు ఉదయం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు

గణేష్ నిమజ్జన ఉత్సవాలకు వినాయక్ సాగర్ లో ఇప్పటి వరకు ఏర్పాట్లు చేయకపోవడం దుర్మార్గం. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తుండటం సిగ్గు చేటు. హిందువుల పండుగలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంత చులకన ఎందుకు? మూడు రోజుల నుండి అడుగుతున్నా కనీసం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం సిగ్గుచేటు.

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలంటూ ర్యాలీ చేసిన భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులను అరెస్ట్ చేయడం అన్యాయం. వినాయక సాగర్ వద్ద ఏర్పాట్లు చేయకపోతే హిందువులంతా గణేష్ నిమజ్జనం ఎక్కడ చేసుకోవాలి?

ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి. వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. హిందువుల సహనాన్ని పిరికితనంగా భావించొద్దు. ఏర్పాట్లు చేయకపోతే ఏం చేయాలో హిందువులకు తెలుసు.

వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఉదయం 11 నుండి 12 గంటల మధ్య ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం.

Leave a Reply