వైసీపీ ఇక ఇంటికే!
( మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు తర్వాత ఆంధ్రా ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం ఇది. ఇలాంటి ‘పర్సెప్షన్ పాలిటిక్స్’ సామాన్య-మధ్యతరగతిపై ప్రభావం చూపుతాయి. ఇది సహజం. ‘బీజేపీ కలిస్తే జగన్ ఇక ఇంటికిపోవడం ఖాయమన్న భావన’ ఏర్పడేందుకు పొత్తు పనికొచ్చింది. మరోవైపు నేరుగా ఇది వైసీపీకి వీరవిధేయత ప్రదర్శించే ఐఏఎస్-ఐపిఎస్ల నుంచి కిందిస్థాయి డీఎస్పీ-ఆర్డీఓల వరకూ ఒక హెచ్చరిక సంకేతం. బీజేపీ విడిగా పోటీ చేస్తుందని, అప్పుడు ఓట్లు చీలి వైకాపాకు కలసి వస్తుందని, ఎన్నికల…