Suryaa.co.in

Andhra Pradesh

చేనేత కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి

– 25 మంది చేనేత కార్మికులకు సోలార్ యూనిట్లు పంపిణీ

రామచంద్రపురం : కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా మంజూరైన సోలార్ యూనిట్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పంపిణీ చేశారు. ఆదివారపుపేటలోని శ్రీ శివ బాలయోగి మహారాజ్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గురువారం జరిగింది.

చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తుందని, ఈ స్కీం ద్వారా ఇప్పటికే జాకాడ మోటర్లు, మిషన్లు మంత్రి సుభాష్ చే గతంలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. సోలార్ యూనిట్లు పంపిణీ ద్వారా విద్యుత్ అంతరాయం ఉన్న సమయంలో కూడా నేత పని చేసుకునేందుకు అవకాశం ఉంటుందని సత్యం వెల్లడించారు. నేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధికారులు, కూటమి నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE