‘వందేళ్ల చరిత్ర కలిగిన ఆ బడిని కొనసాగించాలి’

– ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ

చిత్తూరు జిల్లా కుప్పంలోని పాఠశాలల కోసం టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేఖ రాశారు.ఆర్.పేటలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కొనసాగించాలని కలెక్టర్‌, విద్యాశాఖ కమిషనర్, కార్యదర్శికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్.పేట జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను విలీనం చేయవద్దంటూ చిత్తూరు జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

చారిత్రక పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని లేఖలో పేర్కొన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన పాఠశాలలో 440 మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. పాఠశాల విలీనాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఆర్.పేట పాఠశాల విలీనాన్ని ఉపసంహరించుకుని యథాస్థితిని కొనసాగించాలని లేఖలో కోరారు.

Leave a Reply