– ఇటలీలో జాబ్స్ ఇప్పిస్తానని రూ.7కోట్లు మోసం
– ఫిర్యాదుదారులను నుంచి ఆర్జీలను స్వీకరించిన మంత్రి సబిత, సుజయకృష్ణ రంగారావు
గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భూ కబ్జా, సమస్యలతోపాటు అనేక సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి అర్జీదారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత, మాజీ మంత్రి, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సుజయ క్రిష్ణ రంగారావు వినతులు స్వీకరించారు. భూ సమస్యలపై సంబంధించిన అధికారులతో వెంటనే ఫోన్ లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన యువకులు విజ్ఞప్తి చేస్తూ..కొచ్చెర్ల ధర్మారెడ్డి అనే వ్యక్తి చెందిన రెడ్డెం ఇటలీలో జాబ్ ఇప్పిస్తానని 350 మంది దగ్గర సుమారు రూ.7కోట్లు వసూలు చేసి మోసం చేశారని పిర్యాదు చేశారు. కొచ్చెర్ల ధర్మారెడ్ అనే వ్యక్తి పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని గ్రీవెన్స్ నాయకులకు విజ్ఞప్తి చేశారు.
• తిరుపతి జిల్లా, తిరుపతి రూరల్ మండలం, దామినేడు గ్రామానికి చెందిన వ్యక్తి విజ్ఞప్తి చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులతో కుమ్మకై 22ఏలో ఉన్న భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి చెవిరెడ్డిపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
• అనకాపల్లి జిల్లా, మునగపాక మండలం, మెలుపాక గ్రామానికి చెందిన యెల్లేడి వీర వెంకట సత్య మాధవరావు విజ్ఞప్తి చేస్తూ..వ్యవసాయ పంపుసెట్లకు ట్రాన్స్ ఫార్మర్ వేయుటకు రైతులు వద్ద లంచం తీసుకున్న ఏ.ఈ డెక్కా కనకరాజు ను ప్రశ్నించినందుకు వైసీపీ నాయకుల ప్రోద్బలంతో మాకు పోలాలకు కరెంట్ లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఏ.ఈ కనకరాజు పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
• గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు, అడవి తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన రమణబాయి (72సం..) అనే మహిళ విజ్ఞప్తి చేస్తూ.. గత టీడీపీ హయాంలో ఇచ్చిన టిడ్కో ఇంటి చేయడానికి మున్సిపల్ అధికారులు, బ్యాంక్ అధికారులు లోన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. నీకు వయస్సు అయిపోయింది కాబట్టి లోన్ ఇవ్వడం కుదరదని మొత్తం రూ.3లక్షలు ఒకేసారి కట్టాలి లేదంటే ఇంటిలో సామాను బయట వేస్తామని బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయారు.
• పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, దాచేపల్లి గ్రామానికి చెందిన పప్పుల అనుషా అనే మహిళ విజ్ఞప్తి చేస్తూ.. తన భర్త (అప్పారావు లేట్) కు రావాల్సిన ఆస్తిని తన మరిది, అత్త కలిసి తనకు రాకుండా అడ్డుపడుతున్నారు..దీని వల్ల పిల్లల చదివించడం కష్టంగా మారిందని అన్నారు. కాబట్టి ఆస్తిలో తన భర్తకు రావాల్సిన ఆస్తిని తనకు వచ్చే విధంగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
• గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పాములపాడు గ్రామానికి చెందిన దాడ్డా బుల్లోడు అనే వ్యక్తి విజ్ఞప్తి.. చేస్తూ.. తన పోలంను రెవిన్యూ అధికారులు అన్లైన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. సంబంధించిన అధికారులతో మాట్లాడి తన పోలం అన్లైన్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని నేతలను కోరారు.
• ఏలూరు జిల్లా, నూజీవీడు మండలం, గొల్లపల్లి గ్రామానికి చెందిన చల్లార సత్యనారాయణ, విజ్ఞప్తి చేస్తూ..తన భార్య పేరు మీద ఉన్న 5 ఎకరాలను వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. కబ్జా నుంచి తన భూమిని విడిపించాలని నేతలను కోరారు.
• ప్రకాశం జిల్లా, వెలిగండ్ల మండలం, కంకణంపాడు గ్రామానికి చెందిన కుంచా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేస్తూ..గన్నవరం గ్రామానికి చెందిన రెడ్డెం పద్మ వారు తన భూమిని కబ్జా చేసి వేరే వ్యక్తులు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు..దయచేసి వారి పై చర్యలు తీసుకొని తన పోలం తనకు వచ్చే విధంగా న్యాయం చేయాలని కోరారు.
• పల్లాడు జిల్లా, కారంపూడి మండలం, నరమాలపాడు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు గుదె ఇందుశ్రీ విజ్ఞప్తి చేస్తూ.. కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారమని పింఛన్ తీసుకోవడానికి అన్ని అర్హతలు పింఛన్ రాకుండా కొంత మంది వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దయచేసి తనకు దివ్యాంగురాలు పింఛన్ ఇప్పించవల్సిందిగా కోరారు.
• అనకాపల్లి జిల్లా, మునగపాడు మండలం, యలమంచిలి గ్రామానికి చెందిన గుంట్ల రణమ అనే వ్యక్తి విజ్ఞప్తి చేస్తూ.. 2014-19లో స్వచ్ఛాంధ్రప్రదేశ్ లో భాగంగా ఇంటి నుంచి చెత్త సేకరణ చేయడానికి ఉద్యోగం ఇచ్చిన్నారు..2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నేను తెలుగుదేశంపార్టీ కార్యకర్త అనే ఒక కారణంతో ఆ ఉద్యోగం నుంచి తొలగించారు.