బార్యతో కలహాలు….ఇద్దరి పిల్లలను హత్య చేసిన కానిస్టేబుల్

మహబూబాబాద్: ఆ ఇద్దరిది ప్రేమ వివాహాం.. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే………
గడ్డిగూడెం తండాకు చెందిన రామ్‌కుమార్‌ స్థానికురాలైన శిరీష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేండ్ల క్రితం పెళ్లి చేసుకోగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామ్ కుమార్ ముంబైలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవులపై రామ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరికి వచ్చాడు. సోమవారం రాత్రి భార్య శిరీష.. తన పుట్టింటికి వెళ్లింది. మంగళవారం తెల్లవారుజామున రామ్ తన ఇద్దరు పిల్లలను బైక్‌పై ఎక్కించుకుని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి చంపాడు. బావిలో ఇద్దరు పిల్లల మృతదేహాలను స్థానికులు గుర్తించి, బయటకు వెలికితీశారు.

ఇద్దరు పిల్లలను అమీ జాక్సన్ (8), జానీ బెస్టో (6) గా గుర్తించారు. అయితే జానీ బర్త్‌డేకు ఒక రోజు ముందు తండ్రి రామ్‌కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామ్ ఎక్కడ ఉన్నారు? అనే విషయం తెలియరాలేదు.

Leave a Reply