తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది.. ఆ కుట్రను భగ్నం చేశారు సైబరాబాద్ పోలీసులు.. కొందరు దుండగులు మంత్రిని హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు.. పేట్ బషీరాబాద్లో నిందితులను అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్లో సుపారీ కిల్లర్స్ను అదుపులోకి తీసుకోవడంతో ఈ కుట్ర భగ్నం చేశారు.. మొత్తం ఏడుగురుని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు… ఇక, మంత్రి హత్యకు రూ.12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది.
అయితే, ఈ సుపారీ కిల్లర్లను కలిసింది ఎవరు? వారికి ఆఫర్ చేసింది ఎవరు? ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? మంత్రిని హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది? ఇలా హత్య కుట్ర వెనుక ఉన్న అనేక విషయాలపై పోలీసులు దృష్టి సారించారు.. ఇక, ఈ కేసుకు సంబంధించిన వివరాలను కాసేపట్లో మీడియాకు వెల్లడించనున్నారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర. అయితే, ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్… హస్తిన పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్తో కలిసి వెళ్లారు శ్రీనివాస్గౌడ్.