బీసీ ల్లారా !! కొడాలి నాని ని గుడివాడ నుండి తరిమి కొట్టండి

– లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్

జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ నాయకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ కొడాలి నాని కి రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రోద్బలంతోనే కొడాలి నాని పిచ్చి కూతలు కూస్తున్నాడు అన్నారు.తల్లి లాంటి భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే కొడాలి నాని తల్లి నే అవమానించినట్లు భావిస్తున్నామన్నారు.

బీసీల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరి పై విచ్చల విడిగా మహిళా లోకం తలదించుకునే విధంగా, సిగ్గు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతూ, ఆంధ్ర రాష్ట్ర వినాశకుడు జగన్ రెడ్డి ప్రాపకం కోసం కొడాలి నాని దిగజారి మాట్లాడుతున్నాడు అన్నారు. ప్రస్తుత మంత్రుల్లో కొద్దిమందిని తీసేస్తానని జగన్ రెడ్డి ఎప్పుడైతే అన్నాడో అప్పటినుండి మళ్లీ గజ్జి కుక్క కొడాలి నాని మొరగటం మొదలు పెట్టింది అన్నారు.

జగన్ రెడ్డి యొక్క బలహీనతను కొడాలి నాని అందిపుచ్చుకొని చంద్రబాబు ని, వారి కుటుంబ సభ్యులను తిడితే జగన్ రెడ్డి సంతోషపడి తిరిగి మంత్రి పదవి ఇస్తాడనే ఉద్దేశంతో విచ్చలవిడిగా వికృతచేష్టలు చేస్తున్నాడని లుక్కా ఆరోపించారు. కొడాలి నాని మాట్లాడే భాషని రాష్ట్రంలోని బీసీలందరూ అసహ్యించుకుంటున్నారు అన్నారు. ఇటువంటి మాటలను రాష్ట్రం మొత్తం ముక్తకంఠంతో ఖండిస్తుంటే కనీసం వైసీపీ నేతలు గానీ, జగన్ రెడ్డి గానీ స్పందించక పోవడం విచారకరమని, దీనిని బట్టి చూస్తే జగన్ రెడ్డి నైజం అర్థమవుతోందన్నారు.

ఇటువంటి వారికి మరొకసారి అవకాశం ఇస్తే కుంటుపడిన ఆంధ్రరాష్ట్రం స్మశానంగా తయారవుతుంది అన్నారు. ఇటువంటి చీడపురుగుల కి మరొకసారి అవకాశం ఇవ్వకుండా సహృదయం కలిగిన బీసీల్లారా గుడివాడ లో కొడాలి నాని ని, రాష్ట్రంలో ఉన్న వైసిపి చీడ పురుగులని రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీసీ నాయకులు లుక్కా పిలుపునిచ్చారు. మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రంలోని బీసీ లందరూ నీకు దేహశుద్ధి చేసి, ఆంధ్ర రాష్ట్రం నుండి తరిమి కొడతారని కొడాలి నానిని హెచ్చరించారు.

Leave a Reply