టీడీపీ-బీజేపీని కలిపిన ముర్ము

బీజేపీ టీడీపీ నేతలను రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము మద్దతు కార్యక్రమం కలిపింది. విజయవాడకు వచ్చిన ఆమెకు టీడీపీ నాయకత్వం, గేట్‌వే హోటల్‌లో మద్దతు కార్యక్రమం నిర్వహించింది. దానికి బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. ముర్ముకు మద్దతునిచ్చినందుకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు విడిపోయిన టీడీపీ-బీజేపీ మూడున్నరేళ్ల తర్వాత ఇలా ఒకే వేదిక మీద కనిపించడం ఇదే తొలిసారి. దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిన్న నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఆ పార్టీ నేతల్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ద్రౌపది ముర్ము అంగీకరించారు. ముందుగా మద్దతు ప్రకటించిన వైసీపీ నేతలతో భేటీ కోసం కిషన్murmu-tdp2 రెడ్డితో కలిసి ద్రౌపది ముర్ము అమరావతి వచ్చారు. సీఎం జగన్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయిన తర్వాత ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తనకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. విజయవాడ గేట్ వే హోటల్లో ముగ్గురు టీడీపీ ఎంపీలు, ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు.

బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వేదిక మీద కూర్చున్నారు. కిషన్ రెడ్డి చంద్రబాబు ముర్ము అందరూ మాట్లాడారు. గిరిజన మహిళకు మద్దతు ప్రకటించడం అదృష్టమని అచ్చెన్నాయుడు ప్రకటించారు. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందనిmurmu-tdp1 చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ సోము వీర్రాజు మాట్లాడారు. వైసీపీ ఏర్పాటు చేసినమద్దతు సమావేశం కన్నా ఎక్కువ మంది దృష్టి తెలుగుదేశం పెట్టిన సమావేశంపైనే ఉంది. చివరి క్షణంలో మద్దతు ప్రకటించడం టీడీపీ సమావేశానికి రావడం వైసీపీ వర్గాలను కూడా ఆశ్చర్య పరిచింది.

అయితే ద్రౌపతి ముర్ముకు మద్దతు ఇవ్వాలని టీడీపీ ముందుగానే నిర్ణయించిందని, ఆమె రాష్ట్రానికి వచ్చినప్పుడు టీడీపీ సమావేశంలో కూడా పాల్గొంటుందని తెలిస్తే, వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుందన్న ఉద్దేశంతో చివరి క్షణం వరకూ బయటకు తెలియకుండా ఉంచారని అంటున్నారు. బీజేపీ వ్యూహకర్తలు కూడా గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని, టీడీపీతో మీటింగ్ ఉంటుందని చివరి క్షణం వరకూ బయట పెట్టలేదంటున్నారు. మొత్తానికి ముర్ము అతి స్వల్ప ఓట్లు ఉన్న టీడీపీ విషయంలోనూ అదే సానుకూలత ప్రకటించడం వైసీపీ నేతలకు కాస్త ఇబ్బందికరంగా మారింది.

Leave a Reply