నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం వెలుగు చూసింది.కప్పలతో ఆలుగడ్డ కూర్మా చేసి విద్యార్థులకు వడ్డించారు.ఓ విద్యార్థి తన ప్లేట్లో కప్పను చూసి ఖంగు తిన్నాడు.మిగతా విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
అయితే అధికారులు-మెస్ కాంట్రాక్టర్ సంబంధీకులు కావడంతో విషయం బయటకు పొక్కకుండా వారిని కట్టడి చేశారు. బెదిరించారు.అయినా ఒక ఫోటో బయటకు వచ్చింది.బాసర ట్రిపుల్ ఐటీలో ఏడువేల
మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం మూడు మెస్లున్నాయి.ఇవి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు.
మూడు మెస్ల నిర్వాహకులు -అధికారులు కలిసిపోయారు.కొన్నాళ్ళుగా విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారు.భోజనాల్లో పురుగులు నిత్యకృత్యం కాగా…తాజాగా కప్పను వడ్డించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.క్యాంపస్లో జరుగుతున్న దారుణాలు బయటకు రాకుండా మీడియాను కట్టడి చేస్తున్నారు.క్యాంపస్లోకి అనుమతి ఇవ్వడం లేదు.కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు.విద్యార్థుల తిండి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు చెల్లిస్తోంది.
అయితే క్యాంపస్లో జరుగుతున్న విషయాలు బయటకు చెప్పినా, ఆందోళనలు చేసినా అడ్మిషన్ తొలగిస్తామని మెస్ కాంట్రాక్టర్లు హెచ్చరించడం దుమారం రేపుతోంది.