రంగాను హతమార్చడంలో తప్పులేదన్న గౌతం రెడ్డికి ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ ఇచ్చారు

-రెక్కీ నిర్వహించిన అరవ సత్యం విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్
-హత్యలో ప్రధాన ముద్దాయి కొడుకు జగన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు
– టీడీపీ శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప

వంగవీటి రంగా హత్యకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన కుమారుడు, మాపార్టీ యువ నేత వంగవీటి రాధా బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయం రాష్ట్రం మొత్తానికి తెలిసినా.. వైసీపీ మంత్రులు ఇంకా బురద జల్లే ప్రయత్నంలో మునిగితేలుతున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేకాట మత్తులో నుండి బయటకు రావాలి. రంగాను హత్య చేయడంలో తప్పులేదన్న గౌతం రెడ్డికి ఏపీ ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ పదవి ఇచ్చారు.

వంగవీటి రాధ హత్యకు రెక్కీ నిర్వహించిన వైసీపీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ అరవ సత్యం మీ పార్టీలోనే ఉన్నాడు. రంగా హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న దేవినేని నెహ్రూ కొడుకు దేవినేని అవినాశ్ కు వైసీపీలో పెద్ద పీట వేశారు. అయినా వైసీపీ నాయకులు ఇంకా రంగా హత్యను టీడీపీకి ఆపాదించి కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. నాడు రంగా హత్యను ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి రాజకీయంగా వాడుకున్నారు.

ప్రస్తుతం టీడీపీ యువ నాయకుడిగా ఉన్న రాధాను హత్య చేసి.. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. భద్రత కల్పిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి.. మీ పార్టీ నాయకుడు రెక్కీ నిర్వహించడంపై ఏం సమాధానం చెబుతారు.? వంగవీటి రాధ ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా ఆహ్వానిస్తామని చెబుతున్న వైసీపీ నేతలు.. అతని హత్యకు రెక్కీ నిర్వహించిన అరవ సత్యం, అతన్ని ప్రోత్సహించిన దేవినేని అవినాశ్ ను మీ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదు.?

పనికిమాలిన పరిపాలనతో జగన్ రెడ్డి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. తన పాలనలో చేసిన మంచి ఏంటో చెప్పుకోలేక హత్యలు చేసి కుల చిచ్చు రేపి పబ్బం గడుపుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు మానుకోవాలి.

Leave a Reply