విజయసాయి విశాఖ వచ్చినప్పటి నుంచి శని పట్టుకుంది : హర్షకుమార్

విశాఖపట్నం : ఆంధ్ర యూనివర్సిటీని ఓ రౌడీ యూనివర్సిటీగా మార్చారని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. శుక్రవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి వన్ సైడ్‌గా వ్యవహరిస్తున్నారని, విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కాలుష్యంగా మార్చారని విమర్శించారు. వైఎస్‌ఆర్ విగ్రహం ఏయూ మధ్యలో పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని దూరంగా పెట్టడం దారుణమన్నారు. ఏయూలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. విజయసాయి రెడ్డి విశాఖ వచ్చినప్పటి నుంచి శని పట్టుకుందన్నారు. ప్రసాద రెడ్డి, విజయ సాయి రెడ్డి ఇష్టానుసారంగా వ్యహరిస్తున్నారని, ఏయూలో జరుగుతున్న అక్రమాలపై కమిషన్ వేస్తే మొత్తం భాగోతం బయట పడుతోందని హర్షకుమార్ అన్నారు.

Leave a Reply