ఎన్‌ఐటీ, వరంగల్‌ విద్యార్థులకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆతిథ్యం

హర్యానా రాజ్‌భవన్‌లో నిర్వహిస్తున్న ఏక్‌ భారత్‌ శ్రేష్ట భారత్‌లో భాగంగా తెలంగాణ, హర్యాణా రాష్ట్రాల మధ్య సాంస్కృతికి మార్పిడికి సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్‌ఐటీ, వరంగల్‌ విద్యార్థులకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శనివారం, సెప్టెంబర్‌ 10 హర్యానా రాజ్‌భవన్‌లో ఆతిథ్యం ఇచ్చారు.
ఎన్‌ఐటీ, కురుక్షేత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలంగాణ యొక్క సాంస్కృతిక గొప్పదనాన్ని, వైవిద్యాన్ని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి గవర్నర్‌ దత్తాత్రేయ మాట్లాడుతూ..‘ కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మనల్ని ఒక దేశంగా ఐక్యంగా ఉంచే మన సంస్కృతులు, సంప్రదాయాలు మరియు విలువల యొక్క గొప్పతన్నాన్ని మన విద్యార్థులు తెలుసుకోవాలి. భారత దేశం మన కుటుంబం లాంటిది, ఇది ఎల్లప్పుడూ బలంగా, సంతోషంగా మరియు సంపన్న ఉండాలి’ అన్నారు.

Leave a Reply