– హెల్త్ టూరిజం హబ్ గా హైదరాబాద్
– కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం
– బంజారాహిల్స్ లో ఏఐజీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: నగర ప్రజలకు రెండో అతిపెద్ద హాస్పిటల్ ను అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ని అభినందిస్తున్నా. నాగేశ్వర్ రెడ్డి హైదరాబాద్, తెలంగాణకు గొప్ప పేరు తీసుకొచ్చారు. ఆయన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చింది ఆయన భారతరత్నకు అర్హులు. ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి నా వంతు ప్రయత్నం చేస్తా.
66 దేశాల నుంచి పేషంట్స్ కు AIG ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కు వస్తున్నారు.ఇది గర్వకారణం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాం. అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్ గా ఉంటుంది. హైదరాబాద్ ను హెల్త్ టూరిజం హబ్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం అందులో భాగంగానే డాక్టర్ నోరి దత్తత్యేయుడిని క్యాన్సర్ కేర్ సలహాదారుడిగా నియమించాం.
తెలంగాణ రాష్ట్రం చేపట్టే ప్రణాళికలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని కూడా భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నా. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందిస్తోంది. సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు సరైన విధానంతో ముందుకు వెళుతున్నాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి హెల్త్ ప్రొఫైల్ కార్డుని క్రియేట్ చేయాలని భావిస్తున్నాం. ఒక యూనిక్ ఐడీతో ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఉంటాయి
ఒకప్పుడు ఉన్న ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పోయి ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్స్ రోజులు వచ్చాయి. హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం ద్వారా దీన్ని బ్రేక్ చేయొచ్చు. ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతున్నామని చెప్పడానికే మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ కు ఏఐజీ హాస్పిటల్ విజిట్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి. గోశామహల్ లో నూతన ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించికోబోతున్నాం.. పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో ఉన్న వివిధ ఆసుపత్రులు పూర్తయితే మొత్తం 7 వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తాం.
వైద్య రంగం అభివృద్ధికి రూ.11500 కోట్లు కేటాయించాం. రూ.21500 కోట్లు విద్యా రంగం అభివృద్ధికి కేటాయించాం. పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య అందించాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా మీ వైపు నుంచి సహకారం ఉండాలని కోరుతున్నా. వైద్యులు ఏడాదిలో ఒక నెలరోజులు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలందించండి.
సాంకేతిక రంగంలో ప్రపంచంలో హైదరాబాద్ కూడా ఒక వేదికగా మారింది. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి హైదరాబాద్ కు డైరెక్ట్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. కనెక్టివిటీ పెరిగితే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది.