– కాంగ్రెస్ వచ్చింది.. కరువును తెచ్చింది
– తెలంగాణలో పంటల దుస్థితిపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన
హైదరాబాద్ : నాడు – నడి ఎండాకాలంలో మత్తల్లు దుంకిన చెరువులు నేడు – నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.నాడు – కాలువల నిండా నీళ్లతో ఏడాదికి రెండు పంటలు పండించుకునేందుకు అండగా నిలిచిన కేసీఆర్
నేడు – ప్రాజెక్టులను పడావుబెట్టి, నీళ్లను ఆంధ్రాకు వదిలి పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.
నాడు – సమయానికి రైతుబంధు, 24 గంటల ఉచిత కరంటు, సాగునీళ్లు, విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోళ్లతో రైతు కంటినిండా నిద్ర, కడుపు నిండా సంతోషం.
నేడు – 15 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా రాదు, సాగునీళ్లు ఇవ్వరు, కరంటు ఇవ్వరు, విత్తనాలు దొరకవు, ఎరువులు ఉండవు, అన్ని గండాలు దాటుకుని పంటలు పండిస్తే కొనుగోళ్లు ఉండవు
నాడు – కేసీఆర్ పాలనలో వ్యవసాయ అనుకూల విధానాలతో పండగలా వ్యవసాయం
నేడు – అన్నదాతపై కక్షగట్టి వ్యవసాయాన్ని ఆగంపట్టించిన కాంగ్రెస్ సర్కార్
అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు అశ్వారావుపేట నుండి జహీరాబాద్ వరకు తిరోగమనంలో వ్యవసాయం
సాగునీళ్లు లేక ఎండుతున్న పంటలు .. మండుతున్న రైతుల గుండెలు.
కాంగ్రెస్ వచ్చింది.. కరువును తెచ్చింది.