పోటీలో…పాత్రికేయుడు

విజయనగరం:- ఉత్తరాంధ్ర పట్టబద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పాత్రికేయుడు( ప్రెస్ రిపోర్టర్) పొట్నూరు కిరణ్ కుమార్ (రాజ్ కిరణ్)స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు మీడియాకు తెలియజేశారు.మీడియా మిత్రుల ఆశీస్సులతో, బహుజనుల( ఎస్సీఎస్టీ, బీసీ & మైనారిటీస్ ..) ఆదరాభిమానాలతో, పోటీలో ఉన్నట్లు తెలియజేశారు.ఇతని క్వాలిఫికేషన్ (ఎం.ఎస్సీ ), బి .ఎస్సీ , బి .ఈడి , పీజీడీసీఎ..రాజ్ కిరణ్ ఏపీ & టిఎస్ మీడియా హబ్ ద్వారా, అనేక ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తూ, డిజిటల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ, అనంతకాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఇతను.మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈయన,15 సంవత్సరాలపాటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసి, ఆ తర్వాత మీడియా రంగంలోనికి రావడం జరిగింది. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.బొబ్బిలి తారకరామా కాలనీలో నివాసం ఉంటున్నారు.ఈనెల 13న జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన ఎంత మేరకు విజయవంతం అవుతారో అందరూ వేచి చూడాల్సిందే.

 

Leave a Reply