Suryaa.co.in

Andhra Pradesh

జగన్ 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తి

– 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్.. మాటతప్పి మడమతిప్పాడు
– లోకేష్ ను కలిసిన చింతలపూడి నగర పంచాయతీ ప్రజలు
– జగన్ కి జే బ్రాండ్ లిక్కర్ అంటే ఇష్టం, ఇసుక అంటే ప్రేమ
– కానీ రైతులు, వ్యవసాయం అంటే ద్వేషం
– చింతలపూడి నగర పంచాయితీ ప్రజలు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు

-మా ప్రాంతంలో యువత చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారు
-పరిశ్రమలు పెట్టి ఉద్యోగం, ఉపాధి కల్పించాలి
– మా ప్రాంతంలో పేదవారికి నివాస స్థలాలు, ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. వరి, మామిడి, పామాయిల్ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.
చింతలపూడికి వచ్చే మంచినీటి పైపులైనులో నీరు కలుషితమవుతోంది, కొత్త లైన్ నిర్మించాలి.
• చింతలపూడి నగర పంచాయతీలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొత్తవి నిర్మించాలి.
• టీడీపీ పాలనలో ప్రారంభించిన అనేక సీసీ రోడ్లను వైసీపీ ప్రభుత్వంలో నిలిపేశారు.
• గణేష్ కాలనీ, దేవుడుమాన్యం కాలనీ, బీసీ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, వెలంపేట కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
• రహదారులు సైతం అధ్వానంగా తయారయ్యి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాం.
• నగరంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు..అవి సరిగా వెలగడం లేదు.
• హిందూ శ్మశానవాటిక, పాత చింతలపూడి ఎస్సీ శ్మశానవాటికకు రక్షణ గోడ నిర్మించాలి. ఆక్రమణలను తొలగించాలి.
• చింతలపూడి పట్టణంలో బస్సు డిపో ఏర్పాటు చేసి రవాణా సదుపాయం కల్పించాలి.
• చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి రైతులను ఆదుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రప్రజలకు శాపంగా పరిణమించింది.
• పాదయాత్ర సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్.. మాటతప్పి మడమతిప్పాడు.
• ప్రతియేటా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ విడుదలచేశాడు.
• ఉద్యోగాలు కోసం నిలదీస్తున్న యువతను జైళ్లలో పెట్టి వేధిస్తున్నాడు.
• జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైంది.
• రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి, వాడలు మురికి వాడలుగా మారాయి, ప్రధాన రహదారులు మృత్యు కూపాలయ్యాయి.
• కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడంతో జగన్ ముఖం చూసి పనులుచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
• మేం అధికారంలోకి వచ్చాక చింతలపూడి నగర పంచాయతీని అభివృద్ధి చేస్తాం.
• నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధరిస్తాం.
• ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదలచేసి, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
• అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి మెట్టప్రాంత రైతుల కష్టాలు తొలగిస్తాం.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడిలో పామ్ ఆయిల్ రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్
పామ్ ఆయిల్ మొక్కల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో పామ్ ఆయిల్ నర్సరీ ఏర్పాటు చేయాలి. జగన్ ప్రభుత్వం కొత్త పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అని చెప్పి మోసం చేసింది. కొత్త ఫ్యాక్టరీ పెట్టి రికవరీ రేటు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాం. మొక్క, ఎరువులు, పురుగుల మందులు, లేబర్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.

పాత మొక్కలు తీసి కొత్త మొక్కలు వేసుకోవడానికి ప్రభుత్వం సహాయం అందించాలి. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మాకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు రావడం లేదు. టన్ను కి 13 వేలు రావడం కూడా కష్టం గా మారింది. కనీసం 18 వేలు వస్తే కానీ గిట్టుబాటు కాదు. టిడిపి హయాంలో మొక్క దగ్గర నుండి పురుగుల మందుల వరకూ అన్ని సబ్సిడీలో అందించాం. బోర్డర్ లో ఉన్న పామ్ ఆయిల్ రైతులను వైసిపి నేతలు ఇబ్బంది పెడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో టన్ను కి రూ.1600 ఎక్కువ ఉన్నా మేము అమ్ముకొనే అవకాశం లేకుండా చేశారు. ఆ సొమ్ము అంతా ఎమ్మెల్యే, ఎంపి తిన్నారు.
– చింతలపూడి పామ్ ఆయిల్ రైతులు

లోకేష్ మాట్లాడుతూ..
పామ్ ఆయిల్ ని రాష్ట్రానికి పరిచయం చేసింది ఎన్టీఆర్ గారు.మెట్ట ప్రాంతం రైతుల అభివృద్ది కోసం ఆనాడే ఆలోచించి పామ్ ఆయిల్ రైతులను ప్రోత్సహించింది ఎన్టీఆర్ గారు.పామ్ ఆయిల్ రైతులను ఆదుకుంది, ప్రోత్సహించింది చంద్రబాబు గారు.పామ్ ఆయిల్ రేట్లు పడిపోయినప్పుడు మద్దతు ధర ఇచ్చి ఆదుకుంది చంద్రబాబు గారు.

చింతలపూడి ప్రాజెక్టు ను యుద్ధప్రాతిపదికన పూర్తి చెయ్యాలని చంద్రబాబు గారు పనిచేస్తే జగన్ ఆ ప్రాజెక్టు ను నాశనం చేసాడు.చింతలపూడి ప్రాజెక్టు లో ఒక్క తట్ట మట్టి కూడా తియ్యలేదు.జగన్ కి జే బ్రాండ్ లిక్కర్ అంటే ఇష్టం, ఇసుక అంటే ప్రేమ… కానీ రైతులు, వ్యవసాయం అంటే ద్వేషం.

పామ్ ఆయిల్ రైతులకు సబ్సిడీ లో మొక్కలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందజేసాం.పామ్ ఆయిల్ రైతులకు జగన్ ప్రభుత్వం చేసింది గుండు సున్నా.

దేశంలోనే ఎక్కువ పామ్ ఆయిల్ పండిస్తోంది ఆంధ్రప్రదేశ్.జగన్ పాలన లో పామ్ ఆయిల్ రైతులు బాధితులుగా మారారు.మొక్కలు, ఎరువులు, పురుగుల మందులు, యంత్రాలు, పనిముట్లు దేనికి సబ్సిడీ రావడం లేదు.టిడిపి కేంద్రం తో సంప్రదింపులు చేసి పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకం 49 శాతం విధించే విధంగా చర్యలు తీసుకున్నాం.

ఇప్పుడు కేంద్రం దిగుమతి సుంకం ఎత్తేయడం తో పామ్ ఆయిల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర రావడం లేదు. వైసిపి ప్రభుత్వం, ఎమ్మెల్యే, ఎంపి లు పట్టించుకోవడం లేదు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ ని బలోపేతం చేస్తాం.

పామాయిల్ మొక్కలు ఉచితంగా అందించాలి అనే లక్ష్యంతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎక్కువ దిగుబడి వచ్చే మొక్కల రకాలు అభివృద్ది చేస్తాం. ఇతర దేశాల్లో పామ్ ఆయిల్ రికవరీ రేటు 22 శాతం ఉంటే ఇక్కడ కేవలం 15.5 శాతమే ఉంది . దీనిని పెంచడానికి టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం.టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో అమలు అవుతున్న రికవరీ రేటు ఇప్పించి ఆదుకున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టి రికవరీ రేటు పెంచేలా చర్యలు తీసుకుంటాం. జగన్ ప్రభుత్వం కొత్త ఫ్యాక్టరీ పెడతాం అని మోసం చేసింది.

టిడిపి అధికారంలోకి వచ్చిన పామ్ ఆయిల్ నర్సరీ ఏర్పాటు చేస్తాం.కేంద్ర ప్రభుత్వం తో చర్చించి డైనమిక్ ప్రైసింగ్పాలసీ తీసుకురావడం కోసం టిడిపి కృషి చేస్తుంది.అధికారంలోకి వచ్చేది టిడిపి. కేంద్రం లో కూడా టిడిపి మద్దతు ఇచ్చే పార్టీ నే అధికారంలోకి వస్తుంది. డైనమిక్ ప్రైసింగ్ పాలసీ తీసుకు రావడం కోసం కృషి చేస్తాం.

పామ్ ఆయిల్ పెట్టుబడి తగ్గించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీ తో అనుసంధానం చేసి మొదటి మూడేళ్లు పెట్టుబడి తగ్గించేలా చర్యలు తీసుకుంటాం.పామ్ ఆయిల్ దిగుమతి తగ్గిస్తే మన దేశానికి మేలు జరుగుతుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పామ్ ఆయిల్ పంటను పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సబ్సిడీలు, రాయితీలు అందిస్తాం.

కేంద్రం సబ్సిడీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా జగన్ ప్రభుత్వం ఇవ్వాల్సిన 40 శాతం వాటా ఇవ్వకపోవడం తో పామ్ ఆయిల్ రైతులకు సబ్సిడీలు అందడం లేదు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్, పరికరాలు, యంత్రాలు కూడా అందిస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పామ్ ఆయిల్ మొక్కలు ఉచితంగా అందిస్తాం. జగన్ 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తి అందుకే రాష్ట్రంలో ఉన్న అందరి పైనా కేసులు పెడుతున్నాడు. రైతుల పై కూడా కేసులు పెట్టాడు.

మిషన్ మోడ్ లో పామ్ ఆయిల్ పంటను ప్రోత్సహిస్తాం.డైనమిక్ ప్రైసింగ్ పాలసీ తీసుకురావడం కోసం కృషి చేస్తాం.రైతు కళ్లలో ఆనందమే టిడిపి లక్ష్యం.టిడిపి హయాంలో ఎప్పుడు గిట్టుబాటు ధర సమస్య వచ్చినా చంద్రబాబు గారు ఉదారంగా ఆదుకొనే వారు.జగన్ పాలన లో అసలు వ్యవసాయ శాఖ ఉందా అనే అనుమానం వస్తుంది.

జగన్ పాలనలో రైతు ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3గా ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 గా ఉంది. పామ్ ఆయిల్ పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత టిడిపి తీసుకుంటుంది. పామ్ ఆయిల్ బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. రైతులని ఆదుకోవడం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసుకునే అంశం పై కూడా చర్చించాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మెరుగైన పాలసీలను అధ్యయనం చేసి బోర్డు ఏర్పాటు చేస్తాం.

LEAVE A RESPONSE