చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరికలు

అమరావతి: రాష్ట్రంలో అవినీతితో వచ్చిన సొమ్ముతో వైసిపి నేతలు అరాచకం సృష్టిస్తున్నారని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఎర్రచందనం స్మగ్లర్లకు ప్రభుత్వం పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తుందని విమర్శించారు. వీరందరి ఆట కట్టించాల్సి ఉందని…డబ్బు, అధికారం చూసుకుని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదని చంద్రబాబు అన్నారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన వైసిపి ఎస్ సి సెల్ రాష్ట్ర నేత కొత్తపల్లి శంకర్, ఇతర కార్యకర్తలు టిడిపిలో చేరారు. ఆయనతో పాటు దాదాపు 110 మంది అనుచరులు, కార్యకర్తలు టిడిపిలో
babu-join1 చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చిట్టిబాబు తో సహా పలువురు నేతలు హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కృషిచెయ్యాలని చంద్రబాబు నేతలకు సూచించారు.

Leave a Reply