వలస కార్మికుల సజీవ దహనం బాధాకరం

– మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన

సనత్ నగర్ : సికింద్రాబాద్ బోయగూడ ప్రాంతంలోని టింబర్ డిపోలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనం ఘటనపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసున దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 11 మంది సజీవదహనం కావడం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. బ్రతుకు దెరువు కోసం బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలు ఈ దుర్ఘటనలో మృత్యువు బారిన పడటం అత్యంత దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు తన తరఫున, తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల నష్ట పరిహారం సరిపోదు.. భాదితులకు ఒక్కక్కరికి 20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న. అలాగే భవిష్యత్ లో ఇలాంటి సంఘటన లు జరగకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇటువంటి డిపో లపై తక్షణమే, పరివేక్షించి, నిబంధనలు విరుద్ధంగా వ్యవహారించే కార్యాలయం పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply