లేడీ లెజెండ్

తమిళ చిత్ర రంగాన తారకగా.. రాజకీయ రంగాన ఉక్కు మహిళగా..తమిళ ప్రజల గుండెల్లో అమ్మగా.. పోరాటమే ఊపిరిగా పురిచ్చితలైవిగా తమిళ ప్రజల గుండెల్లో నిలిచిన కుమారి జయలలిత జయరామన్ఫి బ్రవరి 24, 1948న అప్పటి మైసూరురాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరామన్ వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది.జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.

తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించింది.జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది.
ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి, 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందినది. ఆమె పార్టికి కేవలము నాలుగు స్థానాలే దక్కాయి.

2006 లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి, శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్ఠమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు.ఈమె తమిళ నాడు పూర్వ ముఖ్యమంత్రి. అభిమానులు జయలలితను అమ్మ అని,పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.

కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతముతో, తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించింది.జయలలిత తొలి సినిమా ” చిన్నడ గొంబె కన్నడ “చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా ” మనుషులు మమతలు ” ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది.

1972లో తమిళనాడు ప్రభుత్వముజయలలితను కళైమామణి పురస్కారంతో సత్కరించింది. ఈమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు. జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది.తమిళ నాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ” ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం ” యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను పురట్చి తలైవి(విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు.

ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.

ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె, తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.
సెప్టెంబరు 27, 2014 న జయలలిత, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దైంది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది.
మే 11, 2015న కర్ణాటక ఉన్నత న్యాయస్థానము ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
5 డిసెంబరు2016 లో ఆమె మరణించారు.

– హయగ్రీవయ్య గారి మనవడు

Leave a Reply