Suryaa.co.in

National

ఎపిలో మెడిసిన్ ఫ్రం ద స్కై సేవలను ప్రారంభించండి

– డబ్యుఇఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్ తో మంత్రి లోకేష్ భేటీ

దావోస్: వరల్డ్ ఎకనమిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో భేటీ అయ్యారు. విజనరీ లీడర్, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతతో అనుసంధానించి గ్లోబల్ స్టాండర్ట్స్ తో అందరికీ ఆరోగ్యం, పోషకాహారం, సంరక్షణ కల్పించాలన్నది మా లక్ష్యం.

హెల్త్ కేర్ డెలివరీలో ప్రపంచ ప్రమాణాలను సాధించడం, అన్ని ఎఐ – ఎనేబుల్ మెడికల్ హబ్ లను ఏర్పాటు చేయడం, యూనివర్సల్ వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్ అందించడం, పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ రూపొదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలో బెస్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ గా ఎపిని నిలిపేందుకు స్తూల లక్ష్యాలతో బెంచి మార్కులను నిర్ణయించాం. ఆంధ్రప్రదేశ్ ను హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు డబ్లుఈఎఫ్ తరపున సహకారం అందించండి.

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ కు సహకరించండి. ప్రపంచస్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతునివ్వండి. క్యాన్సర్, డయాబిటిక్ రెటినోపతి వంటి వ్యాధల నిర్థారణ కోసం రోగనిర్ధారణ అల్గారిథమ్ లలో ఎఐ వినియోగానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో మెడిసిన్ ఫ్రం ద స్కై సేవలను ప్రారంభించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.

శ్యామ్ బిషన్ మాట్లాడుతూ… భారత్ లో మెడిసిన్ ఫ్రం ద స్కై కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నాం. ఆరోగ్య సంరకణ రంగంలో ఎఐ, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను వినియోగించాలని యోచిస్తున్నాం, ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.

LEAVE A RESPONSE