Suryaa.co.in

Telangana

తెలంగాణకు మోదీ ఏం చేశారో జనాలకు చెబుదాం

– పబ్లిక్‌లో పవర్‌పాయింట్ ప్రెజంటేగన్ ఇద్దాం
– మోదీ ఇచ్చిన నిధుల వివరాలు జనాలకు చెబుదాం
– కేసీఆర్ సర్కారు మోసం, వైఫల్యాలను చాటదాం
– కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి

గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీ నేడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైంది. బిజెపి సీనియర్ నాయకులు మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి , జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి , రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాలు, వైఫల్యాలను ఎండగట్టేలా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 17లోగా ప్రతి జిల్లా కేంద్రంలో డాక్టర్లు, ఇంజినీర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని మార్గనిర్దేశనం చేశారు.

ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు :
గత 9 ఏళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, అభివృద్ధిలో పాత్రను గడపగడపకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం గురించి విశ్లేషించాలి.

జిల్లా స్థాయి సమావేశాల్లో వివిధ రంగాల ప్రముఖులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్ అధికారులను భాగస్వామ్యం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలి. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్నితిప్పికొట్టాలి. కరపత్రాల ద్వారా, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించాలి.

LEAVE A RESPONSE