– ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి
– ఆలయాల అభివృద్ధిపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది
– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– ప్రైవేట్ చానెల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం
నంబూరు: ఆ పరమశివుని ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి. . రంజని అఖాడా మహామండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి జీ మహరాజ్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లా నంబూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగిన ప్రైవేట్ చానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… పవిత్ర కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కైలాసానంద గిరి జీ మహారాజ్ గారితో ఉంటే ఎంతో శక్తి వస్తోంది. దీక్షతో ఆయన కుంభమేళా ఘనంగా నిర్వహించారు.
నేడు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అందరిలో టెన్షన్ ఎక్కువవుతోంది. దేవునిపై భారం వేసినప్పుడు ధైర్యం వస్తుంది. ఒకప్పుడు చిన్న ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లేవాళ్లం. కానీ నేడు ఏఐ సాయంతో మెరుగైన సేవలు పొందుతున్నాం. మనశ్శాంతికి మాత్రం ఎటువంటి మందు లేదు. ఇందుకు దేవుని ఆరాధనే పరిష్కారం.
ఎన్డీఏ ప్రభుత్వం దేవాలయాలపై దృష్టి పెట్టింది. ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మన పిల్లలకు ఆధునిక పరిజ్ఞానం ముఖ్యమే. అవన్నీ సంపద సృష్టికి పనికివస్తాయి. దాంతోపాటు ఆధ్మాత్మిక చింతన కూడా అవసరం . కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. మోదీ, పవన్, నాపై నమ్మకంతొ ప్రజలు అఖండ విజయం అందించారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం. పేదరికం లేని సమాజం నా లక్ష్యం. మన రాష్ట్రం , మన దేశం సుభిక్షంగా,