అమరావతి: ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను చీఫ్ సెక్రటరీ శ్రీ కే. విజయానంద్ తో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సచివాలయంలోని మూడో బ్లాక్ లోని మంత్రి ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. పునరుత్పాదక రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
ఇందులో భాగంగానే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ని రూపొందించినట్లు పేర్కొన్నారు. గతంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన పునరుత్పాదక రంగం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో సోలార్ పవర్ కార్పొరేషన్ పనితీరును మంత్రి గొట్టిపాటి అభినందించారు. నాణ్యమైన విద్యుత్ ను అందించడంలో కార్పోరేషన్ కృషి అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఎస్ కె.విజయానంద్ , ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు, ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చెకూరి, సీపీడీసీఎల్ సీఎండీ పఠాన్ శెట్టి రవి సుభాష్ , సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ కమలాకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.