విజయవాడ: వర్షాల కారణంగా ఎగువ నుంచి కృష్ణానదిలోకి వచ్చిన వరద నీటిని శుక్రవారం ఉదయం 21వ డివిజన్ పాత పోలీసు స్టేషన్ రోడ్డు చివర ఉన్న పుష్కర ఘాట్ సమీపంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేషన్, ఇరిగేషన్ అధికారులతో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ వెంబడి వరద తీవ్రతతో ఊట వచ్చి చుట్టు ప్రక్కల ఉన్న కొన్ని ఇళ్ళల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే చుట్ట ప్రక్కల వారు వాడుకునే మురుగునీరు చెత్తా చెదారంతో నిండిపోయి పడుగులా ఏర్పడిందని, దాంతో దుర్గంధం వస్తుందని తెలిపారు.
వరద తీవ్రతతో వచ్చిన ఊట నీరును మోటార్లు పెట్టించి తిరిగి కృష్ణాదిలోకి మళ్ళీంచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ అధికారులకు గద్దె రామమోహన్ కోరారు.
అందరి సహకారంతో వ్యాధుల నియంత్రణ
కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక పరిశరాల శుభ్రత, దోమల నియంత్రణ ద్వారా వ్యాధుల పెరుగుదలను అరికట్టేందుకు ప్రైడే – డ్రై డే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు