Suryaa.co.in

Telangana

కులగణన సర్వే పేపర్లను తగలబెట్టిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న‌

హైదరాబాద్: కులగణన సర్వే ఓ దొంగ సర్వే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ లోని తన ఆఫీసులో కులగణన సర్వే పేపర్లను తగలబెట్టారు. ‘ఈ సర్వేను మేం ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోం. ఈ విషయాన్ని బీసీలు సహించరు. సర్వేలో దాదాపు 40 లక్షల మంది బీసీలను తగ్గించటం అన్యాయం’ అని ఆయన ఫైర్ అయ్యారు.

LEAVE A RESPONSE