మోదీ భారతీయులను కాపాడే చర్యలు మొదలుపెట్టారు

– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ఉక్రెయిన్ లో ఉన్న 20వేలకు పైగా భారతీయుల ఇబ్బందులను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వెంటనే ఉక్రెయిన్ పరిస్థితులను సమీక్షించి, భారతీయులను కాపాడే చర్యలు మొదలుపెట్టారు.

నిన్న రాత్రి 2 గంటల వరకు నేను కరీంనగర్ నుంచి ఉక్రెయిన్ వెళ్లిన పలు విద్యార్థుల కుటుంబాలను కలిసి, వారికి భరోసా కల్పించాను.పలువురు విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ లో మాట్లాడాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అన్ని దేశాల విజ్ఞప్తి మేరకు . సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలను

మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయడం లేదని రష్యా హామీ ఇచ్చింది.. కనుక ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

‘‘భారతీయులను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా.. నా మాటగా చెప్పండి..’’ అని మోదీ స్పష్టంగా చెప్పారు.రాష్ట్ర పార్టీ తరఫున టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం.మాకొచ్చిన నెంబర్లకు వీడియో కాల్ చేసి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ భయానక వాతావరణం ఉన్నట్టు సోషల్ మీడియాలో ఎవరూ దుష్ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

Leave a Reply