ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్న మోడీ

– రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన సీఎం కెసిఆర్
-ప్రజా సంపదను కొల్లగొడుతున్న పాలకులు
– వైన్స్ దుకాణాలను పెంచడమే తెలంగాణ అభివృద్ధా?
– మధిర కాంగ్రెస్ ప్లీనరీ లో భట్టి విక్రమార్క ఫైర్

ప్రైవేటీకరణ పేరిట దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తుండగా బంగారు తెలంగాణ చేస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.

మధిర మండల కేంద్రంలోని (రెడ్డి గార్డెన్స్) సర్దార్ జమలాపురం కేశవరావు సభాప్రాంగణంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ ప్లీనరీ సమావేశానికి *తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసన సభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ మండలbhatti2 అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. అనేక త్యాగాలతో కాంగ్రెస్ సృష్టించిన దేశ సంపదను కొల్లగొట్టడం లో ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ లు పోటీ పడుతున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ తెచ్చుకుంది అప్పులు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వచ్చే రెండేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం మరో లక్ష కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలపై ఐదు లక్షల కోట్ల భారాన్ని మోపుతోందని వివరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ బడ్జెట్ ను దివాళ తీయించిన కేసీఆర్ ప్రజలపై పన్నుల భారం మోపడం కోసం విద్యుత్ చార్జీలు పెంచుతున్నాడని ధ్వజ మెత్తారు. కరెంటు చార్జీలు పెంచిన నాటి చంద్రబాబు కు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు పడుతుందని హెచ్చరించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా ఆందోళనలు నిర్మించడానికి వచ్చే నెల 9 నుంచి మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యకుండా నిరుద్యోగులను మోసం చేసి, రుణమాఫీ అమలు చేయకుండా రైతులను మోసం చేసి, పావలా వడ్డీ ఇవ్వకుండా మహిళలను మోసం చేసి తెలంగాణ అభివృద్ధి చేశారని టిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు గా ఉందన్నారు. ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో వైన్స్ దుకాణాలను పెంచి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఊరి, ఊరికి బెల్టు దుకాణాలు విస్తరించడమే తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు చేసే పనులకు మంత్రులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాల పేరిట కొబ్బరికాయలు కొట్టడాన్ని అభివృద్ధి అంటారా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో 35 సంవత్సరాలు దాటిన నిరుద్యోగ యువత 100 రోజుల ఉపాధి పనులకు వెళ్లాల్సిన దుస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ధ్వజమెత్తారు.

పెను సవాలుగా మారిన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ MLC నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల రిజర్వేషన్లను నిర్వీర్యం చేయడంలో కుట్రలో భాగంగానే మోడీ సర్కార్ మనువాదాన్ని అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పేరిట కార్పొరేట్ శక్తులకు చేస్తున్నారని దుయ్యబట్టారు.

భట్టి విక్రమార్క కు ఘన స్వాగతం
యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్కూర్ క్రాస్ రోడ్ వద్ద యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు, మహిళా కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క గారికి మంగళహారతులు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్క పై పూలవర్షం కుమ్మరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో కాంగ్రెస్ శ్రేణులకు డిజిటల్ సభ్యత్వ నమోదు, జనవరి 9 నుంచి చేపట్టే పాదయాత్ర, ప్రభుత్వ వైఫల్యాలపై భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ రూపకల్పన పై భట్టి విక్రమార్క వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వేమి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రమణ గుప్తా, పార్టీ అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు దారా బాలరాజు, లాలయ్య, భూక్య బాలునాయక్, చిలువేరు బుచ్చి రామయ్య , ఉండయ్య, ఫయాజ్ , దుంప వెంకటేశ్వర్రెడ్డి, అద్దంకి రవి, తుమ్మేటి నవీన్ రెడ్డి, బోడేపూడి గోపి, ఏదూరి శ్రీను, చావా వేణు, షేక్ బాజీ, అంకంరావు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ మండల అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply