
లోక్ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ.వీ. మిథున్రెడ్డి డిమాండ్
– రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై లోక్ సభలో వైయస్ఆర్సీపీ ఎంపీల నిరసన
– రఘురామ వ్యాఖ్యలపై ఘూటుగా స్పందించిన మిధున్ రెడ్డి
– బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు దోచిన స్కాం స్టర్ రఘురామకృష్ణరాజు
– భారత్ థర్మల్ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి
లోక్ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పీ.వీ. మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
‘సభలో నిరాధార, అసత్య ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరి కాదు. రఘురామకృష్ణరాజు రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. వాస్తవానికి రఘురామకృష్ణరాజుపై రెండు సీబీఐ కేసులు నమోదై ఉన్నాయి. ఆయన బ్యాంకులను మోసం చేశాడు. వాటి నుంచి బయట పడడం కోసం కేంద్రంలోని అధికార(బీజేపీ) పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు మా పార్టీ నుంచి ఎంపీగా గెల్చాడు. ఈ విషయాని ప్రతి ఒక్కరూ గమనించాలి. బ్యాంకులను మోసం చేశాడు కాబట్టి, ఆ కేసుల నుంచి బయట పడడానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల నేను మీ (స్పీకర్ ఛైర్) ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రఘురామకృష్ణరాజు మీద ఉన్న కేసులను వీలైనంత త్వరగా తేల్చండి. భారత్ థర్మల్ పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయండి’.