జగన్‌కు హత్యలు చేయించడం కొత్తకాదు

– వివేకా హత్య కేసులో సీఎం జగన్పై తెదేపా సీనియర్ నేతలు బండారు సత్యనారాయణ- వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్పై తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యలో ఏ1 అవినాష్ రెడ్డి అని వివేకా కుమార్తె సునీత తనకు స్వయంగా చెప్పారన్నారు. జగన్‌కు హత్యలు చేయించడం కొత్తకాదని.. పరిటాల హత్యలో కుట్ర పన్నారని బండారు ఆరోపించారు. ఈ హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ మౌనం వీడాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్పై తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్యలో ఏ1 అవినాష్ రెడ్డి అని వివేకా కుమార్తె సునీత స్వయంగా చెప్పారన్నారు. వివేకా హత్యకు సంబంధించిన సమాచారం తెలిసినా జగన్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీబీఐ విచారణకు అప్పుడు సిద్ధమని.. ఇప్పుడు వెనకడుగు వేశారని విమర్శించారు. సీబీఐ వాగ్మూలంలో వివేకా కుమార్తె ఇచ్చిన అంశాలు పరిగణనలోకి తీసుకొని ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

పరిటాల రవి హత్య కుట్రలో జగన్ పాత్ర ఉందని బండారు ఆరోపించారు. కేవలం పదవి కోసం, ఓట్లు కోసం.. సొంత చిన్నాన్నను చంపిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఈ సమావేశంలో బండారు సత్యనారాయణతోపాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply