నల్గొండ గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. ట్రీస్ ట్రాన్స్ లొకేషన్

– యాభై ఏళ్ల చెట్లను చెక్కుచెదరకుండా మరోచోటకు తరలించే అద్భుత ప్రక్రియ
– ఎంపీ సంతోష్ సారథ్యంలో సాధ్యమైన వైనం

మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చేపట్టింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ .. నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తర్ణలో కోల్పోతున్న యాభై ఏళ్ళ వయస్సును పెద్ద పెద్ద చెట్లకు పునరుజ్జీవం పోస్తున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంట్ సభ్యులు. నల్లగొండ మున్సిపల్ కమీషనర్ రమణాచారి విజ్ఠప్తిని మన్నించి రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ కార్యక్రమానికి పూనుకున్నారు.

ఉదయం నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ ఛైర్మెన్ సైదిరెడ్డి,,వైస్ ఛైర్మెన్ అబ్బగోని రమేష్, మున్సిపల్ కమీషనర్ కె.వీ రమణాచారి , గ్రీన్ ఇండియా సభ్యులు, వాటా ఫౌండేషన్ సభ్యులు ఈ బృహత్ కార్యాన్ని లాంఛనంగా ప్రారంభించారు…పట్టణంలోని యస్పీ బంగ్లా ముందు యాభై ఏళ్ళ వయస్సు గల వేప ,చింత, రాగి,మర్రి చెట్లను వేర్లతో సహా పెకిలించి ,పెద్ద క్రేన్ ల సాయంతో, పెద్ద ట్రక్కులలో చెట్లను తరలించారు.

నల్లగొండ బైపాస్ లోని చర్లపల్లి అర్భన్ పార్క్ లో ఈ చెట్లను తిరిగి నాటారు……వాటా ఫౌండేషన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్దతో, ఈ చెట్లు మోడు వారకుండా, సైంటిఫిక్ పద్దతుల్ని అనుసరించి చెట్లు తిరిగి జీవం పోసుకోని , చిగురించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు……ఇవ్వాళ మొత్తం 12 చెట్లను ట్రాన్స్ లొకేషన్ చేశారు. అందులో 11 వేప చెట్లు కాగా, మరొకటి చింత చెట్టు అని నిర్వాహకులు తెలిపారు.రోడ్ల వెడల్పు వల్ల నల్లగొండ పట్టణంలో మెత్తం 200 పైగా చెట్లు తొలగిస్తున్నామని వాటిని అన్నింటిని దశల వారిగా ఆగస్టు మాసం లోపు ట్రాన్స్ లోకేషన్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.

మెదటి ఫేజ్ లో 50 మొక్కలు ట్రాన్స్ లొకేషన్ చేసే ప్రక్రియను ఇవ్వాళ ప్రారంభించినట్లు ఆయన తెల్పారు..ఇక నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ , వాటా ఫౌండేషన్ ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ , సైంటిఫిక్ పద్దతితో యాభై ఏళ్ళ వయస్సున్న చెట్లకు తిరిగి ప్రాణం పోయడం నిజంగా అద్భుతమని భూపాల్ రెడ్డి అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్యులు ,రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చరిత్రలో చిరస్దాయిగా నిల్చిపోతారని అన్నారు. ఇప్పటికే జాతీయ ,అంతర్జాతీయ స్దాయి అవార్డ్ లను సొంతం చేసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం, ఈ ట్రాన్సో లోకేషన్ కార్యక్రమంతో మరో గొప్ప మైలురాయిని చేరుకున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు సంస్దల కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ కమీషర్ రమణాచారి, మున్సిపల్ ఛైర్మెన్ సైది రెడ్డి, వైస్ ఛైర్మెన్ అబ్బగోని రమేష్, మున్సిపల్ శాఖ అధికారులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు, వాటా ఫౌండేషన్ ప్రతినిధి మురిళి,,పలువురు ఎన్ జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు..

Leave a Reply