– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్
హైదరాబాద్: రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో వచ్చారు.. కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, బుల్డోజర్లు పెట్టి పేదల ఇండ్లు కూల్చినప్పుడు, హెచ్ సీయూలో చెట్లు పీకేస్తున్నప్పుడు .. రాహుల్ గాంధీ ఎప్పుడూ రాలేదు. గతంలో చెప్పాను.. వంద సార్లు అయినా పిలుస్తా… రాహుల్ గాంధీ .. ఎలక్షన్ గాంధీ.
ఎన్నికలప్పుడు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటారు. కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేయలేదు…ప్రజలకు ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. మా మీదున్న కేసుల గురించి మాట్లాడే ముందు .. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి లు బెయిల్ పై ఉన్నారో లేదో ఆలోచించుకోవాలి. ఇతరుల పై ఒక వేలు చూపించినప్పుడు నాలుగు వేళ్లు తమరి వైపు చూపిస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి.