రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా “పర్లపల్లి “

-సర్పంచ్ మాదాడి భారతి నర్సింహా రెడ్డిని అభినందించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
-పాల్గొన్న బీ.ఆర్.ఎస్. లెజిస్లేచర్స్ పార్టీ కార్యదర్శి మాదాడి రమేష్ రెడ్డి

దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సథత్ వికాస్ పురస్కారాలలో భాగంగా పచ్చధనం పరిశుభ్రత విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామం ఎంపికైంది. ఈ సందర్భంగా ఆదివారం మంత్రుల నివాసంలో పర్లపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి మాదాడి భారతి నర్సింహా రెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభినందనలు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పర్లపల్లి గ్రామంలో హరిత విప్లవం తీసుకుని వచ్చిన సర్పంచ్ మాదాడి భారతి నర్సింహా రెడ్డి రాష్ట్రంలోని ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారని వినోద్ కుమార్ అన్నారు. భవిష్యత్తులో పర్లపల్లి సర్పంచ్ మాదాడి భారతి నర్సింహా రెడ్డి మరిన్ని అవార్డులు, రివార్డులు సాధించాలని కోరుకుంటున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.పర్లపల్లి గ్రామాన్ని రానున్న రోజుల్లో మరింత గ్రీనరిగా తీర్చిదిద్దాలని వినోద్ కుమార్ ఆకాంక్షించారు. సర్పంచ్ మాదాడి భారతి నర్సింహా రెడ్డితోపాటు ఆమె కుమారుడు బీ.ఆర్.ఎస్. లెజిస్లేచర్స్ పార్టీ కార్యదర్శి మాదాడి రమేష్ రెడ్డి కూడా ఉన్నారు.

Leave a Reply