భట్టి పాదయాత్రకు పీసీసీ నేతలు సంఘీభావం

టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముదిగొండ మండలం వల్లభి గ్రామాంలో శుక్రవారం నిర్వహించిన పాదయాత్రలో పీసీసీ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, మహబూబాద్ డిసిసి అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి లు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించి పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్న విక్రమార్కుడి అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు.

స్థానిక సిపిఎం, టిడిపి, ఎంఆర్పిఎస్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పూలమాలవేసి సి ఎల్ పి నేతను సత్కరించారు. అనంతరం గ్రామంలో జరిగిన పాదయాత్రలో విక్రమార్క తో కలిసి అడుగులో.. అడుగులు వేసి కదం తొక్కారు.

Leave a Reply