రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2115 మున్సిపల్ పాఠశాలలలో 80% అయన 1675 పాఠశాలలు విలీనం అయి, చివరకు 20% అయన 335హైస్కూల్ పాఠశాలలు మాత్రమే మిగలనున్నాయి.
విద్యాశాఖ విలీన ఉత్తర్వులు పురపాలక స్కూల్స్ లో అమలు కావలంటే పురపాలక / నగరపాలక కౌన్సిల్ లో తీర్మానం ఆమోదం పోందాలని & ఆ స్కూల్ పేరేంట్స్ కమిటి కూడా తీర్మానం ఆమోదం జరగితేనే పురపాలక స్కూల్స్ లో విలీనం పక్రియ అమలు అవుతుంది .మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాధమిక
పాఠశాలలను దగ్గర లోని హైస్కూల్ లలో విలీనం చేయడం వల్ల పురపాలక పరిధిలోని దళితులు బహజనులు SC,ST,BC మరియు మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ విద్య దూరం మరియు మరింత భారం కానుంది.
కావున స్దానిక మేయర్లు & చెర్మన్లు & పట్టణ ప్రాంతపు mlc & MP & MLÀ ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నాం .ఇప్పటికే అత్యధిక పిల్లల చేరటం .. తగిన రూములు, వసతులు లేక పురపాలక హైస్కూల్ లపై వత్తిడి. 3 కిలోమీటర్ల నిభందనల వలన , పెద్ద రహదారుల వలన ట్రాఫిక్ సమస్యలు & రైల్వే లైన్లు & ఫైవోర్లు & పెద్ద మురికికాలువలు వల్ల పిల్లలకు ప్రమాదకరం. పురపాలక విద్యా వ్యవస్థకు గొడ్డలిపెట్టు.ఇంకా ఇలాంటి అనేక సమస్యలు తలెత్తకుండా హైస్కూలులలో ప్రాధమిక పాఠశాలలలోని 3,4,5 తరగతుల విలీనాన్ని MTF తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాష్ట్ర అధ్యక్షులు S.రామకృష్ణ అన్నారు.