సమన్యాయం చేసిన జగన్

– మంత్రి మేరుగు నాగార్జున

రాష్ట్ర ఫ్రభుత్వ మంత్రి వర్గ విస్తరణతో నూటికినూరు శాతం సమన్యాయాన్ని సిఎం అమలు పరిచారని మంత్రి డాక్టర్ మేరుగ నాగర్జున పేర్కొన్నారు . సోమవరం మంత్రిగా పదవీప్రమాణ స్వీకారం అనంతరం అయన రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డిని కలిశారు . సజ్జలను మాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లడుతూ సిఎం జగన్ మోహన రెడ్డి మంత్రి వర్గ విస్తరణలో వివిధ కోణాలను పరిశీలిస్తూ అన్ని వర్గాలవారికి దామాషా ప్రకారం సమన్యాయం సంపూర్ణంగా చేశారన్నారు . బడుగు బలహీన దళిత వర్గాల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమకు సజీవ సాక్ష్యంగా తనను మంత్రిని చెయ్యడం ఒక అసాధారణ ఉదాహరణ అని పెర్కొన్నారు .

పదవులు రానోళ్లు నిరాశ పడొద్దని , అనవసర వివాదాలు చెయ్యొద్దని ప్రార్దిస్తున్నాన్నారు . అపార్ధాలు పక్కన పెట్టి అందరం కలిసి రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని నాగార్జున కోరారు. రానున్న ఎన్నికలలో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ నేతృత్వంలోని వైసిపికి అఖండ మెజారిటీ వచ్చేలా కృషిచేయాలని అయన పిలునిచ్చారు . ఈ కార్యక్రమంలో క్రిష్టియన్ జాయింటు యాక్షన్ కమిటి రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ పాల్గొన్నారు .

 

Leave a Reply