లిక్కర్ సేల్స్‌లో స్కామ్

డిజిటిల్ ఇండియాకు విరుద్ధంగా జగన్ పాలన
లోక్‌సభలో మళ్లీ సర్కారుపై రఘురామ ధ్వజం
ఏపీలో మద్యం అమ్మకాల్లో గోల్‌మాల్‌పై.. ఎంపీ రఘురామకృష్ణంరాజు గురువారం లోక్‌సభలో ప్రస్తావించారు. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా స్ఫూర్తికి విరుద్ధంగా లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయని, మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు జరగడం లేదని పేర్కొన్నారు. మద్యం షాపుల్లో నగదు మాత్రమే

తీసుకోవడం వెనుక పెద్ద స్కామ్‌ ఉందని ఆరోపించారు. ఏపీలో మద్యం అమ్మకాల్లో లావాదేవీలపై కేంద్రం దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్ధిక మంత్రి జోక్యం చేసుకుని నగదు చెల్లింపుల స్థానంలో… డిజిటల్‌ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు.

Leave a Reply