కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో వరుస చోరీలు జరుగుతున్నా నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. నగరంలో చోరీలు చేస్తున్న వారిని చెడ్డీగ్యాంగ్గా భావిస్తున్నా మని సీపీ కాంతిరాణా వెల్లడించారు. ఈ తరుణంలో సీపీ గుణదల, ఉప్పులూరు, మధురానగర్ రైల్వేస్టేషన్లలో డీసీపీ హర్షవర్థన్రాజు, అదనపు డీసీపీ బాబూరావు, క్రైం ఏసీపీ శ్రీనివాసరావుతో కలిసి తనిఖీ చేసినట్లు తెలిపారు. ఇక నగరంలో దొంగలను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అంతేకాక.. ఈ ముఠాలు చోరీలకు ఇతర నగరాలకు వెళ్లినప్పుడు శివారు రైల్వేస్టేషన్ల వద్ద, రైల్వే ట్రాక్లకు పక్కన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటాయని మధ్యప్రదేశ్ పోలీసులు వెల్లడించారు.