ప్రభుత్వ అలసత్వం వల్లే ఇలాంటి ప్రమాద ఘటనలు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాద ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలి ఆరుగురి సజీవ దహనం కావడం బాధాకరమని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 12మందికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం అలసత్వంతో వ్యవహరించడం వల్లనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని లోకేష్ పేర్కొన్నారు.

ఇటువంటి ఘటనలు అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు అరికట్టడం కోసం ప్రభుత్వం ఇప్పటికైనా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని లోకేష్ వెల్లడించారు.

Leave a Reply