చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన తంబళ్లపల్లి వైసీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి, అనుచరులు

అమరావతి:- పుంగనూరు, తంబళ్ల పల్లి నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో వైసిపికి డిపాజిట్ రాకూడదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తంబళ్ల పల్లి కిచెందిన వైసిపి నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి, ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.

మద్దిరెడ్డి భార్య తంబళ్ల పల్లి వైసిపి జడ్పిటిసిగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అరాచకాలు, అవినీతిని మద్దిరెడ్డి కొండ్రెడ్డి గట్టిగా ప్రశ్నించారు. దీంతో కొండ్రెడ్డిపై అధికార పార్టీనేతలు
tdp-join1 కేసులు పెట్టి వేధించారు. వైసిపి అరాచక పాలనను వ్యతిరేకిస్తూ కొండ్రెడ్డి తెలుగు దేశం తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ని ఈ సారి ఎన్నికల్లో ఓడిస్తామని కొండ్రెడ్డి చెప్పారు. పుంగనూరులో పెద్దిరెడ్డికి, తంబళ్ల పల్లిలో ద్వారకానాథరెడ్డికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా పని చెయ్యాలని చంద్రబాబు సూచించారు.

ఇప్పుడు దౌర్జన్యాలతో రాజ్యం ఏలుతున్న వారికి అధికారంలోకి వచ్చిన తరవాత అంతే గట్టిగా సమాధానం చెపుతామని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలో 14 సీట్లూ గెలిచేలా పార్టీని సిద్దం చెయ్యడంపై ఫోకస్ పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, శ్రీనివాసులు రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శంకర్ యాదవ్, చల్లా బాబు రెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్, పర్వీన్ తాజ్ పాల్గొన్నారు.

Leave a Reply