విశాఖ ప్రజలను చూస్తే.. సీఎంకు భయం పట్టుకుంది

– మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత

పాయకరావుపేట : విశాఖ ప్రజలను చూస్తే సీఎంకు భయం పట్టుకుందని తెదేపా మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
అందుకే సీఎం వెళ్లే దారిలో దుకాణాలు మూయించారని, ట్రాఫిక్ని ఆపేశారని దుయ్యబట్టారు. విశాఖ ప్రజలను చూస్తే సీఎంకు భయం పట్టుకుందని తెదేపా మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.

అందుకే సీఎం వెళ్లే దారిలో దుకాణాలు మూయించారని, ట్రాఫిక్ ఆపేశారని దుయ్యబట్టారు. ప్రజలను చూసి భయపడే వారిని నాయకుడు అనరని విమర్శించారు.విశాఖ ప్రజలు నిన్న 3 గంటలపాటు అనేక ఇబ్బందులు పడ్డారన్న ఆనిత.. గంటలపాటు ట్రాఫిక్ నిలిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీఎం, పోలీసులు.. విమాన ప్రయాణీకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని వచ్చి, సీఎం ఇక్కడే ఉంటే విశాఖ ప్రజలను రోడ్లపై తిరగనివ్వబోరని ఆరోపించారు.

Leave a Reply