Suryaa.co.in

Telangana

భవిష్యత్ మనదే

– అన్ని వర్గాలలో ఈ ప్రభుత్వం పై అసంతృప్తి
– సత్తుపల్లి మున్సిపాలిటీ బీ ఆర్ ఎస్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు సమావేశం

హైదరాబాద్: గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దగ్గర నుంచి గమనిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ఏమిటో నిన్నటి గ్రామసభలను చూస్తే తెలుస్తోంది. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని గ్యారంటీ లపై నిలదీస్తున్నారు. గ్రామ సభలకు వేసిన టెంట్లను కూడా ప్రజలు కోపం తో పీకేస్తున్నారు.

సత్తుపల్లి లో సండ్ర వెంకట వీరయ్య ,ఖమ్మం లో పువ్వాడ అజయ్ ఓడిపోవడంతో ఆ నియోజక వర్గ ప్రజలు ప్రజలు ఎంతో కోల్పోయారు. గ్రామాలు ,పట్టణాల్లో కేసీఆర్ హాయం లో జరిగినన్నీ పనులు గతం లో ఎపుడూ జరగలేదు. మున్సిపాలిటీ కి 50 లక్షలు కేటాయిస్తే గొప్ప అనుకునే పరిస్థితి ఉండేది ..కేసీఆర్ హయం లో ఆ పరిస్థితి మారి పల్లెలు ,పట్టణాల్లో అభివృద్ధి జరిగింది.

భవిష్యత్ మనదే. అన్ని వర్గాలలో ఈ ప్రభుత్వం పై అసంతృప్తి ఉంది. సత్తుపల్లి లో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే. మళ్ళీ కేసీఆర్ ను సీఎం ను చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదాం. ఉమ్మడి ఖమ్మం లో మళ్ళీ బీ ఆర్ ఎస్ విజయకేతనం ఎగరేస్తుంది. సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు 23 మంది బీ ఆర్ ఎస్ నుంచి గెలిస్తే ,17 మంది ఇంకా పార్టీ లోనే కొనసాగుతుండటం పార్టీ పట్ల వారికున్న విధేయత కు నిదర్శనం.

రైతుల సమస్యల పై అధ్యయన కమిటీ వేశాము. రానున్న రోజుల్లో ప్రజావ్యతిరేక ప్రభుత్వం పై మరింత గట్టిగా పోరాడదాం. త్వరలోనే సత్తుపల్లి నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు.

LEAVE A RESPONSE