– పార్లమెంట్ రాజ్యసభలో బిల్లు చర్చ సమయంలో మా పార్టీ పూర్తి మద్దతు
– అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించి.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ , బీఆర్ఎస్ నేతలు కిషోర్ గౌడ్ కురువ విజయ్ కుమార్
హైదరాబాద్ : అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చాము.. మా పని అయిపోయింది అని అనుకోవద్దు. 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. పార్లమెంటులో బిల్లు పెట్టి.. బిల్లు ఆమోదం పొందే వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. తమిళనాడు తరహా అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించి.. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి.
ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ బీసీ అంశాలపై ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నారు.. బీసీల సంక్షేమంపై తమకే చిత్తశుద్ధి ఉందని భారతీయ జనతా పార్టీ చెబుతుంది. బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. బీసీలకు రాజ్యాధికారం ఇస్తామని మాట్లాడుతున్నారు. ఈ రెండు పార్టీలకు కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. ఎలాంటి చిక్కులు రాకుండా తమిళనాడు తరహా అన్ని రంగాల్లో బీసీలకు, రిజర్వేషన్ కల్పించే విధంగా బిల్లుకు ఆమోదం తెలిపేందుకు రెండు పార్టీలు ప్రయత్నించాలి.
బిల్లుకు సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కొన్ని అంశాలున్నాయి.. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి.. మీరు ఇచ్చిన మాట ప్రకారం జ్యోతిబాపూలే గారి పేరు మీద బీసీ సబ్ ప్లాన్ అమలు కోసం ఏడాదికి 20 వేల కోట్లు కేటాయించాలి.
ఏడాది గడిచిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి 20వేల కోట్లు విడుదల చేయాలి. 42 శాతం విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుకూలంగా ఎంబీసీ మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలి. ఎన్నో ఏండ్లుగా దగా పడ్డ ప్రజలకు..అవమానాలకు.. ఆర్థికంగా ఇబ్బంది పడిన ప్రజలు బీసీ రిజర్వేషన్ లతో జీవితాలు బాగుపడుతాయాని ఆశగా ఎదురు చూస్తున్నారు.
చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని గతంలో తీర్మానం తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే.. అసమానతలు లేని సమాజం నిర్మాణం జరగాలన్న చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే సాధ్యం. 42 శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి.
పార్లమెంట్లో ఈ బిల్లుకు ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా.. ఆ పార్టీని తెలంగాణలో ప్రజల మద్దతు ఉండదని పార్టీని భూస్థాపితం చేస్తారు. పార్లమెంట్ రాజ్యసభలో బిల్లు చర్చ సమయంలో మా పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఇప్పటికే ప్రకటించాం