– తిరుపతి ఘటనపై తితిదే ఈవో స్పందన
– విచారణలో కీలక వివరాలు
తిరుపతి: పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను తితిదే ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని చెప్పారు. ఇందులో 41 మందికి గాయాలయ్యాయని, ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.
ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని వైద్యులు డిశ్చార్జి చేసినట్లు తితిదే ఈవో చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు. ఇద్దరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని.. చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. .