పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే అసలు ఈ హత్యే జరిగేది కాదు

– మాచర్లలో జల్లయ్య హత్య, పోలీసులు వైఖరిపై డిజిపికి లేఖ రాసిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు

లేఖలో చంద్రబాబు:-
కుటుంబ సభ్యుల అనుమతిలేకుండా పోలీసులే జల్లయ్య మృతదేహాన్ని బలవంతంగా రావులాపురం తరలించారు. కుటుంబ సభ్యులను సైతం పోలసులు బలవంతంగా బస్సుల్లో అక్కడికి తీసుకువెళ్లారు. పార్టీ కార్యకర్త జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలను, టిడిపి బృందాన్ని పోలీసులు అరెస్టులతో అమానవీయంగా అడ్డుకున్నారు.
జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టిడిపి నేతలకు, అతని బంధువులను అనుమతించాలి.పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే అసలు ఈ హత్యే జరిగేది కాదు. 2019 తరువాత ఒక్క మాచర్లలోనే 5గురు బిసి వర్గం వారిని హత్య చేశారు.

అందులో 4గురు యాదవ సామాజికవర్గం వారే ఉన్నారు. పోలీసుల మద్దతుతో వైసిపి వరుస హత్యలతో టీడీపీ మద్దతుదారులను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది.

మాచర్లలో బిసి వర్గంపై జరుగుతున్న హత్యాంకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలి. హంతకులకు మరణ శిక్ష విధించేలా పోలీసు శాఖ చర్యలు ఉండాలి.

Leave a Reply