వైసీపీ పార్టీకి టైమ్ దగ్గర పడింది

-చర్యలకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది
-ఇంతకింతకు బదులిస్తాం
-తెనాలి కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు చేతిలో దాడి కి గురైన ఆర్యవైశుడు టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ ని పరామర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద బాబు, కన్నా లక్ష్మీనారాయణ

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. కౌన్సిల్ లో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు పై ప్రశ్నిస్తే యుగంధర్ పై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.రాష్ట్రం మొత్తం వైసీపీ ఆధ్వర్యంలో దాడులు యదేచ్చుగా షరా మామూలు అయిపోయిన పరిస్థితి. సీఎం పర్యటన అంటే నాయకులు వసూళ్లుకు తెరలేపుతున్నారు. రాష్ట్ర సంపద సింగిల్ టెండర్ల రూపంలో తాబేదారులకు దోచి పెడుతున్నారు.నామినేషన్ పోస్ట్లు ఇస్తున్న మాదిరిగా సింగిల్ టెండర్లు తమ వారికి కట్టబెడుతున్నారు
ముఖ్యమంత్రి చెబుతున్న చందంగా దోచుకు పంచుకో నాయకులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. జగన్ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తండ్రిని అడ్డుపెట్టుకుని దోచుకున్నారు.జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్న ప్రశ్నిస్తే దాడులు,కేసులు పెడుతున్నారు.

తెనాలిలో వైసీపీ నాయకులు చేసే పనులు పిల్ల చెస్టల్లాగా ఉన్నాయి.గత నాయకులు తెనాలి చరిత్ర ను కాపాడుకుంటూ వస్తున్నారు.వైసీపీ నాయకులు తెనాలి వాతావరణన్నీ నాశనం చేస్తున్నారు. వైసీపీ పార్టీకి టైమ్ దగ్గర పడింది. ప్రజలపై దాడి చేసిన వారిని పిలిచి మరి కేసులు పెట్టడం రాష్ట్రంలో తమాషా గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలు చూసి అయిన అధికారుల్లో మార్పు రావాలి.ప్రజలు వైసీపీ పార్టీ ని గద్దె దించటానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగాలకు ఉద్యోగాలు శాశ్వతం, రాజకీయాలు కాదు. తమ వద్ద లిస్టు ఉంది ఎవరిని వదిలిపెట్టేదేలేదు. ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్ పై దాడులు చెయ్యటం వైసీపీ ఎలా సమర్ధించుకుంటుంది? వైసీపీ చర్యలను అన్నిటిని గమనిస్తున్నాము. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన వైసీపీ ఇళ్లకు పోవటం ఖాయం మరి అధికారులు ఎక్కడి పోతారు. చర్యలకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. ఇంతకింతకు బదిలిస్తాము అని హెచ్చరించారు.

Leave a Reply